Tuesday, February 8, 2011

The Specialization Of Hindu Temples:హిందూ దేవాలయాల ప్రత్యేకత


దేహానాం ప్రాక్తో దేవాలయహః
ప్రాచీన కాలం నుంచి హిందూ మతంలో దేవాలయాలకు విశిష్ఠమైన స్థానం కలదు. ఎంతో చరిత్ర కలిగి, మరెంతో ప్రాశస్త్యమైన దేవాలయాలు నేడు రాజకీయాల వల్ల, నాయకుల ద్వంద్వ వైఖరుల వల్ల తమ ప్రాభవాన్ని కొల్పోతున్నాయి.హిందూ సమాజానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపునిచ్చిన దేవాలయాలు జాతికి ఒక దిశానిర్దేశాన్ని చేసాయి.
. హిందువుల ఆరాధన నిమిత్తం రకరకాల పేర్లతో శివాలయాలు, విష్ణు ఆలయాలు తప్పవు. మొత్తంపై ఏదో ఒక పవిత్ర స్థలం అంటూ లేని గ్రామం, పట్టణం ఉండదు. గ్రామాలలో శివ, విష్ణు ఆలయాలు కాక, గంగానమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ మొదలైన దేవతల ఆలయాలు కూడా వెలుస్తాయి. హిందూ దేవాలయాలకు సంబంధించినంతవరకు వాటి నిర్మాణం ఎంత ప్రాచీనమైనదనే విషయం మనకు తెలియదు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వేదకాలంలో విగ్రహారాధన లేదు. విగ్రహారాధన సంప్రదాయం ఉంటే తప్ప దేవాలయాల ఆవశ్యకతలేదు. కనుక వేదయుగం తర్వాతనే ఎప్పుడో దేవాలయ నిర్మాణం ప్రారంభమై ఉంటుందని స్థూలంగా చెప్పవచ్చు. యజ్ఞయాగాదులలో నిర్మించే వేదికలే ఆ తర్వాతి కాలపు ఆలయ నిర్మాణానికి ఒరవడి దిద్దాయని కొందరు అంటారు. . హిందూమతంలో నిర్గుణోపాసన, సగుణోపాసన రెండూ ఉన్నాయి. సగుణోపాసన అంటే సాకారుడైన భగవంతుని ధ్యానించి, పూజించి, ఆరాధించడం. ఈ ఆరాధన కోసం విగ్రహం అవసరమైంది. ఆలయ నిర్మాణం కోసం ఆగమశాస్త్రం అవసరమైంది. దేవాలయ నిర్మాణ శిల్పం భారతదేశంలో పరాకాష్టను చేరింది. అందులోను ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలో ఆలయ వాస్తు....అత్యద్భుతమైన శిల్ప నైపుణ్యంతో అలరారింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆలయ నిర్మాణ నైపుణ్యంలో ఏ ప్రాంతానికి తీసిపోలేదు. మొత్తం దేశంలోనే మొట్ట మొదటి శిలా నిర్మిత దేవాలయంగా గుంటూరు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వరాలయాన్ని .....చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాల ప్రభావం వల్లనో, వివిధ కాలాలలో దండయాత్రల వల్లనో శిథిలమై పోయినవి పోగా, ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన ప్రసిద్ధ దేవాలయాలు ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి. వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, వేములవాడ, కాళేశ్వరం, దాక్షారామం, మహానంది, అమరావతి మొదలైన చోట్ల గల శైవాలయాలు, తిరుమల, భద్రాచలం, సింహాచలం, యాదగిరి, మంగళగిరి, ర్యాలి, అన్నవరం ,మహబూబ్ నగర్ జిల్లాలోని సింగోటం లోని లక్శ్మీనరసింహాలయం ...మొదలైన చోట్ల గల వైష్ణవాలయాలు ప్రసిద్ధమైనవి. కాగా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరాలయం, శ్రీశైలంలోని భ్రమరాంబా మల్లిఖార్జునాలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, భద్రాది రామాలయం, బెజవాడ కనకదుర్గాలయం వంటివి యావద్భారత ప్రశస్తి పొందాయి. హిందూ దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉన్నది. అవి కేవలం ఆరాధనాలయాలు మాత్రమే కాదు. మొత్తం హైందవ సంస్కృతికే నిలయాలు. ముఖ్యంగా గ్రామాలలో అవి ప్రజల సాంఘిక, సాంస్కృతిక, బహుళార్థ సాధక కేంద్రాలు. ప్రజా జీవితంలో వాటిది ప్రముఖ పాత్ర. పూర్వకాలంలో రాజులు, జమీందార్లు దేవాలయాలు నిర్మించేవారు. వాటి నిర్వహణకు, అర్చకుల పోషణకు విరాళాలు, మడిమాన్యాలు, అగ్రహారాలు దానం చేసేవారు. పండుగలకు, పబ్బాలకు, ఉత్సవాలకు దేవాలయాల ప్రాముఖ్యం మరింతగా పెరిగేది. అసలు దేవాలయ నిర్మాణమే గొప్ప శిల్పకళా నైపుణ్యంతో కూడి ఉండేది. అదికాక ఉత్సవాది వివిధ సమయాలలో అక్కడ నృత్య, నాటక, యక్షగాన ప్రదర్శనలు, సంగీత సభలు, పురాణ పఠనాలు, హరికథా శ్రవణాలు జరిగేవి. వాటితో పాటు సంతలు, తిరుణాళ్ళు జరిగేవి. సాధారణ సమయాలలో దేవాలయ ప్రాంగణాలలో పాఠశాలలు, ముఖ్యంగా వేదపాఠశాలలు నడిపేవారు. వైద్యశాలలుగా కూడా ఆ ప్రాంగణాలు ఉపయోగపడేవి. దేవాలయాలున్న ప్రాంతాలను పుణ్యక్షేత్రాలంటారు. ఆసేతు శీతాచలం విస్తరించిన విశాల భూఖండంలోగల అనేక పుణ్యక్షేత్రాలను దర్శించడానికి పూర్వకాలంలో కాలినడకన, గుర్రపు బళ్ళపైన, ఎడ్ల బళ్ళపైన ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు ఆధునిక వాహన సదుపాయాలు వచ్చాయి. భారతదేశం విభిన్న భాషలతో కూడినదైనా భిన్నత్వంలో ఏకత్వం అనే భావన పెంపొందడానికి హిందూమతం, దాని బాహిర రూపాలైన పుణ్యక్షేత్రాలు దోహదం చేశాయి. దేవాలయాలను, ముఖ్యంగా ప్రసిద్ధ దేవాలయాలను సాధారణంగా నదీ తీరాలోను, సముద్రతీరంలోను నిర్మించడం ఒక ఆనవాయితీ. అలా వెలసిన వాటిని పుణ్యతీర్థాలనేవారు. అయితే, అనేక ప్రఖ్యాత దేవాలయాలు పర్వత శిఖరాగ్రాలపైన, లేదా పర్వత సానువులపైన కూడా నిర్మించడం జరిగింది. నదీతీరాలలో ఉన్నా కొండలపై కట్టినా , సాధారణంగా ప్రతి దేవాలయానికి యాత్రికుల స్నాన సౌకర్యాల నిమిత్తం జలాశయం విధిగా ఉండేది. నదులు, సముద్రం ఉంటే సరే. లేకపోతే పుష్కరిణి పేరుతోనో, కొలను పేరుతోనో జల సదుపాయం ఉండవలసిందే . దేవాలయానికి హృదయం వంటిది గర్భగుడి. దానికి ప్రత్యేక ద్వారం తప్ప మరొక ద్వారంగాని, గవాక్షంగాని ఉండదు. తైల దీపాల వెల్తురులోనే దేవుడిని దర్శించాలి. అందుచేతనే గర్భగుడి చీ
Add Imageకటిని చీలుస్తూ నిత్య దీపారాధన జరుగుతూ ఉంటుంది. గర్భ గుడి పైన గోపురం, లేదా విమానం ఉంటుంది. దానిపై కలశం. గర్భగుడి ముందు ముఖ మండపం, దాని ముందు మహా మండపం, దానిముందు ధ్వజ స్తంభం, శివాలయమైతే నంది విగ్రహం, విష్ణు ఆలయమైతే గరుడ విగ్రహం తప్పవు. గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణాలు చేయడానికి ఖాళీ స్థలం ఉంటుంది. మొత్తం దేవాలయానికి రక్షణగా ఎత్తయిన ప్రాకార కుడ్యాలుంటాయి. ఆవరణలో వివిధ దేవతామూర్తులతో కూడిన చిన్న చిన్న మందిరాలు మండపాలు ఉంటాయి. ప్రధాన ద్వారంపైన చాలా దూరం కనిపించే కొన్ని అంతస్థుల గోపురం కూడా తప్పనిసరి. గర్భగుడిలోని మూలవిరాట్టు కంటె మండపాలలోను, గోపురాల మీదను, స్తంభాలపైన, మందిర కుడ్యాలపైన హిందూ శిల్పుల కళా వైదగ్ధ్యాన్ని వెల్లడిచేస్తూ అద్భుత శిల్పాలు సాక్షాత్కరిస్తాయి. నల్లటి బండరాళ్ళ నుంచి అంతటి సజీవ మూర్తులను ఎలా సృష్టించారా ఆనాటి శిల్పులు అని ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా యక్షిణులు, అప్సరసలు మొదలైన స్త్రీమూర్తుల నృత్య భంగిమాన్విత లాలిత్యం ఈనాటికీ చూపరులను ముగ్దులను చేస్తుంది. ఈ విషయంలో కాకతీయుల కాలం నాటి తెలుగు శిల్పుల ప్రతిభ మొత్తం దేశంలోనే ఏ ప్రాంతపు శిల్ప నైపుణ్యానికి తీసిపోనిది. ఇవికాక, చాలా దేవాలయాలలో బ్రహ్మోత్సవాలు, రథోత్సవాలు జరపడం ఒక ఆనవాయితి. కొన్ని దేవాలయాలకు బ్రహ్మండమైన రథాలుంటాయి. వాటిలో కూడా శిల్పకళా నైపుణ్యం గోచరిస్తుంది. గ్రామాలలో అయితే ఎడ్లు పూన్చిన బండ్లపై శివరాత్రి, విజయదశమి మొదలైన పండుగలకు ఉన్నంతలో వైభవంగానే ఊరేగింపులు జరుగుతాయి. తెలుగువారి సాంఘిక సాంస్కృతిక జీవితంలో దేవాలయాలకు విశేష ప్రాధాన్యం ఉంది..నేడు హిందూ దేవాలయాలు రాజకీయనాయకుల కబంధహస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి..... బంధ విముక్తి జరిగి పూర్వవైభవం రావాలనీ మనః పూర్వకంగా ఆకాంక్షిస్తూ......
మీ...తూర్పింటి

Monday, February 7, 2011

Dragging of Rock Competation in SINGOTAM:సింగోటంలో బండలాగుడు పోటీలు


సింగోటంలో బండలాగుడు పోటీలు ప్రతీ సంవత్సరం సంక్రాంతి తర్వాత జరుగుతాయి.వేలాది ప్రజల ఆనందోత్సహాల మధ్య ఈ ఏడాది పోటీలు జరిగాయి. తూర్పింటి

సింగోటంలో బండలాగుడు పోటీలు
సింగోటం గ్రామంలో ప్రతీ సంవత్సరంలాగానే ఏడాది కూడా బండలాగుడు పోటీలు
లక్శ్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల తదనంతరం జరిగాయి. ఊళ్ళోని సంతబజారుకు
అభిముఖంగా ఉన్న పొలాళ్లో "ఈ పోటీలుచూపరులకు నయనానందంతో పాటు దుస్తులకు
కాసింత దుమ్మును "ఉచితంగా అందించాయి.
పోటీల్లో రెండు ఎద్దుల జంట విభాగంలో మొదటి బహుమతిని ...
1517 అడుగుల 10 ఇంచుల దూరం లాగిన వనపర్తి ,జంగిడి రాజు ఎద్దుల జంట కైవసం చేసుకున్నాయి.
వీరికి ఒక తులం బంగారం ను సింగోటం గ్రామ సర్పంచ్ ఎల్లపోగుల వెంకటస్వామి
చేతులమీదుగా ఇవ్వడం జరిగింది.
ఇహ రెండవ బహుమతిని 1232అడుగుల 10 ఇంచులు లాగిన దావాజిపల్లి ,ప్రవీణ్ రెడ్డి
ఎద్దుల జంట కైవసం చేసుకున్నాయి.వీరికి అర తులం బంగారం ను కార్యక్రమం
తదనంతరం గ్రామ సచివాలయం లో ఇవ్వడం జరిగింది.
3
బహుమతిని సింగిల్ విభాగంలో (వ్యక్తిగత విభాగంలో)బి.బాలయ్య , కోడేర్ ఎద్దు 80 అడుగుల 10 ఇంచులు లాగి
10
తులాల వెండిని గెలుపొందింది.
కార్యక్రమంలో ............................
ఎం.పి.పి శ్రీ జి.నరేందర్ రెడ్డి ,
గ్రామసర్పంచ్ శ్రీ .వెంకటస్వామి,ఉప సర్పంచ్ శ్రీ సిలోన్ ,శ్రీ బుచ్చిబాబు ,ఎం.పి.టి.సి శ్రీ పాండు, గ్రామ కాంగ్రేస్ యువ నాయకులు శ్రీ కె.వీరయ్యశెట్టి , గ్రామ నాయకులుశ్రీ గణాచారి,
వార్డ్ మెంబర్ శ్రీ జి.నరసింహా,శ్రీ పి.వెంకటస్వామి,గ్రామ యువకులు ,వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన ప్రజలతో కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.
సేకరణ
: తూర్పింటి నరేశ్ కుమార్

Tuesday, February 1, 2011

SINGOTAM BRAHMOSTAVALU:సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు


సింగోటంలో మకర సంక్రాతి తర్వాత ప్రతి ఏడాది 17 వ తేదీన రథోత్సవం జరుగుతుంది.ఈ ఏడాది మాత్రం జనవరి 18 న రథోత్సవం (తేరు) జరిగింది.---తూర్పింటి.నరేశ్ కుమార్

సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
జిల్లాలోనే అతి ప్రాచీనమైన ఆల యాల్లో సింగోటం శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామికి విశిష్టత సంత రించుకుంది. కొల్లాపూర్‌కు 10కి.మీ దూరంలో ఉన్న సింగో ట శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయంలో స్వామివారు వెలి శారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ తాలుకా సింగోటం లో పెద్ద ఎత్తున జరిగే స్వామివారి ఉత్సవాలు సింగోటం జా తరగా పేరొందింది .
మకర సంక్రాంతి సందర్భంగా ప్రారం భమయ్యే శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి ఉత్సవాలకు మహబూ బ్‌ నగర్‌ జిల్లా నుంచేకాక పొరుగు జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు.కర్నూల్‌, ఆత్మకూర్‌, నందికోట్కూర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, పాలమూరు, దేవరకొండ, అచ్చంపేట, గద్వాల, తాండూరు, సికింద్రాబాద్‌, తదితర ప్రాంతాల నుంచేకాక పొరుగునున్న కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి జరిగే ఈ జాతరలో ప్రజలకు కావలసిన వంట పాత్రలు బంజార కుటుంబాలకు కావలసిన ఆభరణా లు బట్టలు ఈ జాతర లో దొరుకుతాయి.

అందుకోసం పేద, ధనిక, భేదం లేకుండ అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవాలల్లో పాల్గొని వారికి కావలసిన వస్తువులను కొను గోలు చేసుకోవడం తమ మొక్కుబడులు తీర్చుకోవడం స్వామివారికి తలనీలాలు అర్పించడం వంటివి చేస్తారు. ప్ర క్కనే ఉన్న శ్రీవారి సముద్రం చెరువు నీటితో కళకళ లాడు తుండడంతో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామికి అభిముఖంగా రత్నగిరి కొండపై
శ్రీలక్ష్మిదేవి కొలువై , ఆ దేవతే చెంచులక్ష్మిగా అవతరించింది. ఇక్కడి స్వామి వారికి నిత్యం అభిషేకం పూజా కైంకర్యాలు జరుగుతాయి.అయితే ఇక్కడ ప్రతిష్టించిన శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామికి ఒక ఆకారమంటూ లేదు. లింగాకారం లోనే భక్తుల కు దర్శనమిస్తుంటారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఈసారికొత్తగా గోపురం నిర్మించి అందులో స్వామి పాదాలను ప్రతిష్టించడం విశేషం. ‘స్వామివారి ఇతిహాసం’ శ్రీలక్ష్మిన ర్సింహ్మ స్వామి ఈ ప్రాంతంలో వెలియడంవెనుక ఆసక్తికరమైన ఇతిహాసం వుందని తలపండిన పెద్దలు, సంస్థానంలో కొలువుచేసిన పూర్వీకులు చెబుతారు. 500 ఏళ్ళ క్రితం సురభి వంశానికి చెందిన 11వ తరంవాడైన సింగమనా యుడనే భూపాలుడు జటప్రోల్‌ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించేవాడు ఓ తన పొలంలో ఒక మూలన అరుక దున్నుతుండగా లింగరూపంలో గల శిలనాగలి కర్రుకు అడ్డుతలిగింది.

పలుమార్లు తన నాగలికి అడ్డుతగులుతున్న శిలను ఆ రైతు ఎన్నిసార్లు ఒడ్డుమీదకు చేరినా తిరిగి అక్కడే ప్రత్యక్షమై అతని పనికి అంతరాయం కలిగిస్తుండేది. అమాయకుడైన ఆ రైతు అడ్డు తగులుతున్న శిలమహిమను గుర్తించలేక దేవుడిని ప్రార్థిస్తూ తనను కరుణించమని పేదవాడినూన తనను ఏ శక్తి వేధించకుండా చూడమని ప్రా ర్థించాడు. ఒక రాత్రి భూపాలుడైన సింగమనాయుని కలలో శిలరూపంలో ఉన్న దేవుడు కనిపించి తాను ఈ ప్రాంతానికి ఉత్తరదిశలో పొలంలో లింగరూపంలో వెలిశానని చె ప్పాడు. తాను రోజు నాగలికి అడ్డుతగులుతున్న అతను నన్ను నర్సింహ్మస్వామిగా గుర్తించడం లేదని చెబుతాడు, ఇదే దినం నడిజాములో తనను గుర్తించి వెంటనే ప్రతిష్టించి పూ జలు జరపాలని చెబుతాడు.సింగమనాయుడు తాను కల కన్నది నిజమా....? అని తెలుసుకునేందుకు సైన్యంతో పొలా న్ని కాగడాల సహాయంతో వెతుకుగా లింగరూపంలో వెలిగిపోతున్న శిల సరిగా ఉండ డంతో అప్పటికప్పుడు భూ పాలుడు ఆ లింగాన్ని అభిషేకించి ప్రతిష్టించారని ప్రచారంలో ఉన్న కథనం. స్వామికి ఎండ తగలకుండ నాపరాయి, మట్టితో చిన్న గుడిని నిర్మించారు. ఆ గుడి నేటికి ప్రస్తుతం ఉన్న శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామి ఆలయంలో వున్న.... గర్భాలయం భక్తులకు దర్శనమిస్తుంది. లింగాకారంలో శిలా విగ్రహమే ప్రజలకు నిత్యం దర్శన మి స్తున్న స్వామియే శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి

15 నుండి ఉత్సవాలు ప్రారంభం
ఈ నెల 15 నుండి 20 వరకు శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి ఉ త్సవాలు జరుగుతాయని
పురోహితుడు ఓరుగంటి సతీశ్ కుమార్ 9704321252తెలిపారు
15 వ తేది బ్రహ్మోత్సవాలు అభిషేకం
16 వ తేది శకటోత్సవం , పల్లకీ సేవ ,లక్ష్మినర్సింహ్మస్వామికల్యాణోత్సవం
17 సింహవాహన సేవ , లక్ష్మీ గణపతీ హోమం
18 స్వామివారి రథోత్సవం (తేరు)
19 రత్న లక్స్శ్మీ అమ్మవారి అభిషేకం ,సహస్ర నామ పారాయణం ,తెప్పోత్సవం
20 తీర్హావళి , బలి హరణం , డోలోత్సవం , చప్పురపు సేవ

మరింత సమాచారం కోసం చూడండి...
http://singotam.blogspot.com
http://www.etelangana.org/telangana_books.asp

--------తూర్పింటి నరేశ్ కుమార్

TOTAL INFORMATION OF SINGOTAM


TOTAL AREA .... 839 HECTORS (8.39Sq Km.)
POPULATION ......3O48
HOUSES ....692
PRIMARY HEALTH CENTERS ----- 01
VETARNARY CENTERS ----- 01
MOBILE HEALTH CENTERS ----- 00
MEDICAL SHOPS .......02
POST OFFICES ------ 01
VILLAGE PIN CODE ------509102

SELF HELP GROUPS(SHG) 36
RATION SHOPS 02
ANGANWADI CENTERS 05
ASH WORKERS 05
COMMUNITY CENTERS 01
SPORTS FIELD 01

FOREST AREA NIL
NON AGRICULTURAL LAND (USES) 36 HECTORS
UN-CULTIVATED LAND 178 HECTORS
CULTIVATABLE WAST LAND 40 HECTORS
FALLOW-LAND(vagulu n vankalu) 30 HECTORS
CURRENT FALLOE LAND 40 HECTORS

NET AGRICULTURE SOURCE 347 HECTORS
(panta pandedi area)

TOTAL IRRIGATION LAND 137 HECTORS

UN-IRRIGATED LAND 400HECTORS
CAVELS(KALUVALU) 00 HECTORS
WELL-BOREWELLS 31 HECTORS
TANKS & LAKES 104 HECTORS
PRIMARY SCHOOL 01
PRIVATE SCHOOLS 02
HIGH SCHOOLS 01
MAHABUBNAGAR TO SINGOTAM DISTANCE (౯౫మ్ )...౯౫మ్