Wednesday, January 13, 2016

సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు JAN,2016


సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు JAN,2016
సింగోటంలో మకర సంక్రాతి తర్వాత ప్రతి ఏడాది 18వ తేదీన రథోత్సవం జరుగుతుంది.---తూర్పింటి.నరేశ్ కుమార్
సింగోటం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
జిల్లాలోనే అతి ప్రాచీనమైన ఆల యాల్లో సింగోటం శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామికి విశిష్టత సంత రించుకుంది. కొల్లాపూర్‌కు 10కి.మీ దూరంలో ఉన్న సింగో ట శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి దేవాలయంలో స్వామివారు వెలి శారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ తాలుకా సింగోటం లో పెద్ద ఎత్తున జరిగే స్వామివారి ఉత్సవాలు సింగోటం జా తరగా పేరొందింది .
మకర సంక్రాంతి సందర్భంగా ప్రారం భమయ్యే శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి ఉత్సవాలకు మహబూ బ్‌ నగర్‌ జిల్లా నుంచేకాక పొరుగు జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు.కర్నూల్‌, ఆత్మకూర్‌, నందికోట్కూర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, పాలమూరు, దేవరకొండ, అచ్చంపేట, గద్వాల, తాండూరు, సికింద్రాబాద్‌, తదితర ప్రాంతాల నుంచేకాక పొరుగునున్న కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి జరిగే ఈ జాతరలో ప్రజలకు కావలసిన వంట పాత్రలు బంజార కుటుంబాలకు కావలసిన ఆభరణా లు బట్టలు ఈ జాతర లో దొరుకుతాయి.
అందుకోసం పేద, ధనిక, భేదం లేకుండ అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవాలల్లో పాల్గొని వారికి కావలసిన వస్తువులను కొను గోలు చేసుకోవడం తమ మొక్కుబడులు తీర్చుకోవడం స్వామివారికి తలనీలాలు అర్పించడం వంటివి చేస్తారు. ప్ర క్కనే ఉన్న శ్రీవారి సముద్రం చెరువు నీటితో కళకళ లాడు తుండడంతో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామికి అభిముఖంగా రత్నగిరి కొండపై
శ్రీలక్ష్మిదేవి కొలువై , ఆ దేవతే చెంచులక్ష్మిగా అవతరించింది. ఇక్కడి స్వామి వారికి నిత్యం అభిషేకం పూజా కైంకర్యాలు జరుగుతాయి.అయితే ఇక్కడ ప్రతిష్టించిన శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామికి ఒక ఆకారమంటూ లేదు. లింగాకారం లోనే భక్తుల కు దర్శనమిస్తుంటారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఈసారికొత్తగా గోపురం నిర్మించి అందులో స్వామి పాదాలను ప్రతిష్టించడం విశేషం. ‘స్వామివారి ఇతిహాసం’ శ్రీలక్ష్మిన ర్సింహ్మ స్వామి ఈ ప్రాంతంలో వెలియడంవెనుక ఆసక్తికరమైన ఇతిహాసం వుందని తలపండిన పెద్దలు, సంస్థానంలో కొలువుచేసిన పూర్వీకులు చెబుతారు. 500 ఏళ్ళ క్రితం సురభి వంశానికి చెందిన 11వ తరంవాడైన సింగమనా యుడనే భూపాలుడు జటప్రోల్‌ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించేవాడు ఓ తన పొలంలో ఒక మూలన అరుక దున్నుతుండగా లింగరూపంలో గల శిలనాగలి కర్రుకు అడ్డుతలిగింది.
పలుమార్లు తన నాగలికి అడ్డుతగులుతున్న శిలను ఆ రైతు ఎన్నిసార్లు ఒడ్డుమీదకు చేరినా తిరిగి అక్కడే ప్రత్యక్షమై అతని పనికి అంతరాయం కలిగిస్తుండేది. అమాయకుడైన ఆ రైతు అడ్డు తగులుతున్న శిలమహిమను గుర్తించలేక దేవుడిని ప్రార్థిస్తూ తనను కరుణించమని పేదవాడినూన తనను ఏ శక్తి వేధించకుండా చూడమని ప్రా ర్థించాడు. ఒక రాత్రి భూపాలుడైన సింగమనాయుని కలలో శిలరూపంలో ఉన్న దేవుడు కనిపించి తాను ఈ ప్రాంతానికి ఉత్తరదిశలో పొలంలో లింగరూపంలో వెలిశానని చె ప్పాడు. తాను రోజు నాగలికి అడ్డుతగులుతున్న అతను నన్ను నర్సింహ్మస్వామిగా గుర్తించడం లేదని చెబుతాడు, ఇదే దినం నడిజాములో తనను గుర్తించి వెంటనే ప్రతిష్టించి పూ జలు జరపాలని చెబుతాడు.సింగమనాయుడు తాను కల కన్నది నిజమా....? అని తెలుసుకునేందుకు సైన్యంతో పొలా న్ని కాగడాల సహాయంతో వెతుకుగా లింగరూపంలో వెలిగిపోతున్న శిల సరిగా ఉండ డంతో అప్పటికప్పుడు భూ పాలుడు ఆ లింగాన్ని అభిషేకించి ప్రతిష్టించారని ప్రచారంలో ఉన్న కథనం. స్వామికి ఎండ తగలకుండ నాపరాయి, మట్టితో చిన్న గుడిని నిర్మించారు. ఆ గుడి నేటికి ప్రస్తుతం ఉన్న శ్రీలక్ష్మినర్సింహ్మ స్వామి ఆలయంలో వున్న.... గర్భాలయం భక్తులకు దర్శనమిస్తుంది. లింగాకారంలో శిలా విగ్రహమే ప్రజలకు నిత్యం దర్శన మి స్తున్న స్వామియే శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి
15 నుండి ఉత్సవాలు ప్రారంభం
ఈ నెల 15 నుండి 20 వరకు శ్రీలక్ష్మినర్సింహ్మస్వామి ఉ త్సవాలు జరుగుతాయని
పురోహితుడు ఓరుగంటి సతీశ్ కుమార్ 9704321252తెలిపారు
15 వ తేది బ్రహ్మోత్సవాలు అభిషేకం
16 వ తేది శకటోత్సవం , పల్లకీ సేవ ,లక్ష్మినర్సింహ్మస్వామికల్యాణోత్సవం...8:P.M
18 స్వామివారి రథోత్సవం (తేరు) 4P.M( JAN,2016)
19 రత్న లక్స్శ్మీ అమ్మవారి అభిషేకం ,సహస్ర నామ పారాయణం ,తెప్పోత్సవం 7P.M (JAN,2016)
మరింత సమాచారం కోసం చూడండి...
http://singotam.blogspot.com
http://www.etelangana.org/telangana_books.asp
--------తూర్పింటి నరేశ్ కుమార్
POSTED BY NARESH THURPINTI

No comments:

Post a Comment